Telugu Global
Andhra Pradesh

ఫ్రెండ్‌కు గంజాయి తాగించి.. భర్తతో అత్యాచారం చేయించి

అత్యాచారం చేసిన వీడియోలు, ఫొటోలను యువతి అన్నకు, కాబోయే భర్తకు పంపారు ఈ కిలాడీ భార్యాభర్తలు. యువతి కుటుంబాన్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారు.

ఫ్రెండ్‌కు గంజాయి తాగించి.. భర్తతో అత్యాచారం చేయించి
X

తిరుపతిలో దారుణం జరిగింది. కిలాడీ దంపతులిద్దరు యువతుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గలీజ్‌ దందా గుట్టురట్టయింది. నగరంలోని ప్రముఖ యూనివర్సిటీలో BL ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవి కృష్ణారెడ్డి, కర్నూలుకు చెందిన తన స్నేహితురాలైన ఓ యువతికి రెండేళ్లుగా గంజాయి అలవాటు చేసింది. హాస్టల్‌లో ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పి తరచూ తన ఇంటికి తీసుకువెళ్లేది. గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త కృష్ణ కిషోర్‌రెడ్డితో అత్యాచారం చేయించి వీడియోలు తీసింది.

అత్యాచారం చేసిన వీడియోలు, ఫొటోలను యువతి అన్నకు, కాబోయే భర్తకు పంపారు ఈ కిలాడీ భార్యాభర్తలు. యువతి కుటుంబాన్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో బాధితురాలు ఎంఆర్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కిలాడీ భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి రూ. 5 లక్షలు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.

First Published:  26 July 2024 5:08 PM GMT
Next Story