Telugu Global
Andhra Pradesh

మంచి చేస్తే ఓడిస్తారా..? మాజీ మంత్రి ఆవేదన

ప్రజలకు గతంలో ఎప్పుడూ ఎవరూ చేయలేనంత మంచి చేశామని వివరించారు సీదిరి అప్పలరాజు. అయినా తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు.

మంచి చేస్తే ఓడిస్తారా..? మాజీ మంత్రి ఆవేదన
X

ప్రజలకు మంచి చేస్తే ఓడిస్తారా..? అంటూ మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయని, తమ హయాంలో ఎక్కడా ఏ ఒక్కరిపై దాడులు జరగలేదని, ఇప్పుడు మాత్రం వైసీపీ అంటే చాలు ఇంటిలోపలికొచ్చి మరీ కొడుతున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదన్నారు. ఇందుకోసమేనా ప్రజలు టీడీపీని గెలిపించిందని ప్రశ్నించారు అప్పలరాజు.


మంచి చేశాం, కానీ..!

ప్రజలకు గతంలో ఎప్పుడూ ఎవరూ చేయలేనంత మంచి చేశామని వివరించారు సీదిరి అప్పలరాజు. అయినా తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం చూడకుండా మంచి చేయడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారాయన. పాత ప్రభుత్వం వెళ్లి, కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్న ఈ సంధి కాలంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రాష్ట్ర గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు అప్పలరాజు.

మీరేం బలవంతులు కాదు..

ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన టీడీపీ నేతలు బలవంతులనుకోవడం అపోహ అని అన్నారు సీదిరి అప్పలరాజు. ఏడాది తర్వాతయినా, ఐదేళ్ల తర్వాతయినా వైసీపీ తిరిగి పుంజుకుంటుందని, మళ్లీ ప్రజా క్షేత్రంలో, ఎన్నికల్లో సత్తా చూపిస్తుందని అన్నారాయన. టీడీపీది గెలుపు కాదని కుండబద్దలు కొట్టారు. ప్రజా సంక్షేమ పాలన అందించిన వైసీపీదే అసలైన గెలుపు అని వివరించారు అప్పలరాజు.

First Published:  9 Jun 2024 11:38 AM GMT
Next Story