Telugu Global
Andhra Pradesh

హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్..

మదనపల్లెలో ప్రభుత్వ రికార్డులు తగలబడిన కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.

హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్..
X

ఎన్నికల హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సూపర్‌ సిక్స్‌ అంటే చంద్రబాబు భయపడుతున్నారని, ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారని చెప్పారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తన క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చేస్తున్నారని అన్నారు పెద్దిరెడ్డి. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, కానీ చంద్రబాబు ఆ పని చేస్తున్నారని విమర్శించారు.


చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి. మదనపల్లెలో ప్రభుత్వ రికార్డులు తగలపడితే తమపై నిందలు వేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలతో తమపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని, డిమాండ్ చేశారు. అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపించారు. తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచామని తాము ఏ విషయంలో అయినా పారదర్శకంగా ఉంటామని చెప్పారు పెద్దిరెడ్డి. కేసులు పెట్టి తమను వేధించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

మదనపల్లెలో రికార్డులు తగలబడిన కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని మరీ మదనపల్లె వచ్చారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారని, కేసులు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు పెద్దిరెడ్డి.

First Published:  7 Aug 2024 10:21 AM GMT
Next Story