Telugu Global
Andhra Pradesh

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై బాబు కుట్ర.. పవన్‌, బాలయ్యలకు జగన్‌ సూటి ప్రశ్న

ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీనే తీసుకువచ్చినప్పటికీ.. ఆ యాక్ట్‌ను జగనే తీసుకువచ్చాడని నమ్మించే ప్రయత్నం చేస్తోంది.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై బాబు కుట్ర.. పవన్‌, బాలయ్యలకు జగన్‌ సూటి ప్రశ్న
X

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అన్ని అస్త్రాలు ఫెయిల్ కావడంతో సామాన్యుడిలో ఆందోళన కలిగించేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారానికి తెరతీసింది పచ్చమాఫియా. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీనే తీసుకువచ్చినప్పటికీ.. ఆ యాక్ట్‌ను జగనే తీసుకువచ్చాడని నమ్మించే ప్రయత్నం చేస్తోంది.

ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్‌. చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఇటీవల రిషికొండలో భూములు కొన్నాడని చెప్పారు జగన్. ఇక దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం మంగళగిరిలో భూములు కొన్నారన్నారు జగన్. మరీ ఈ ఇద్దరికి అధికారులు ఒరిజినల్ రిజిస్టర్డ్‌ డీడ్స్‌ ఇచ్చారా.. లేక‌ జిరాక్స్ కాపీలు ఇచ్చారో చెప్పాలన్నారు జగన్‌.

రాష్ట్రంలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పారు జగన్. వాళ్లందరికి ఒరిజినల్, రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చామన్నారు. కానీ చంద్రబాబు, తెలుగుదేశం చేస్తున్న కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్.

First Published:  11 May 2024 10:18 AM GMT
Next Story