Telugu Global
Andhra Pradesh

ఏపీ రిజల్ట్ చూసి దేశం షాక్ అవుతుంది -జగన్

ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన రావడం విశేషం. పీకే ఆలోచించలేనన్ని సీట్లు ఈసారి వైసీపీకి వస్తాయన్నారు జగన్.

ఏపీ రిజల్ట్ చూసి దేశం షాక్ అవుతుంది -జగన్
X

ఏపీ ఎన్నికల ఫలితాలు ఈసారి మరింత సంచలనంగా ఉంటాయని అన్నారు సీఎం జగన్. విజయవాడలో ఐ ప్యాక్ టీమ్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐ ప్యాక్ ప్రతినిధులతో మాట్లాడారు జగన్. ఏడాదిన్నరగా పార్టీకోసం కష్టపడి పనిచేశారని అభినందించారు. వారితో సెల్ఫీలు దిగారు.

జగన్ ఫుల్ హ్యాపీ..

పోలింగ్ డే తర్వాత తొలిసారిగా జగన్ ఇలా బయటకు వచ్చారు. ఐ ప్యాక్ ఆఫీస్ లో ఆయన చాలా సంతోషంగా కనిపించారు. గతంలోకంటే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాలు వైసీపీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని, ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు. దేశం ఈ ఫలితాలు చూసి షాక్ అవుతుందన్నారు జగన్. ఎంపీ సీట్లు కూడా పెరుగుతాయన్నారు.

పీకే ప్రస్తావన..

అరగంటసేపు ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు జగన్. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన కూడా రావడం విశేషం. పీకే ఆలోచించలేనన్ని సీట్లు ఈసారి వైసీపీకి వస్తాయన్నారు జగన్. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని చెప్పారు.

First Published:  16 May 2024 8:03 AM GMT
Next Story