విశాఖ, విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం నిధులు
ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరిన సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్టు విభాగం
BY Raju Asari19 March 2025 7:15 PM IST

X
Raju Asari Updated On: 19 March 2025 7:15 PM IST
విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల సీఎంపీ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్టు విభాగం కోరింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. విశాఖలో రూ. 84.47 లక్షలతో, విజయవాడలో రూ. 86.68 లక్షలతో సిస్ట్ర సంస్థ ప్లాన్ రూపొందించనున్నది. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసింది.
Next Story