Telugu Global
Andhra Pradesh

స్కూల్‌ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి – 15 మంది విద్యార్థులకు గాయాలు

నెల్లూరు జిల్లాలో స్కూల్‌ బస్సును లారీ ఢీకొనడంతో బస్సు క్లీనర్‌ మృతిచెందాడు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

స్కూల్‌ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి – 15 మంది విద్యార్థులకు గాయాలు
X

నెల్లూరు జిల్లాలో స్కూల్‌ బస్సును లారీ ఢీకొనడంతో బస్సు క్లీనర్‌ మృతిచెందాడు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కావలి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.

ప్రమాదానికి గురైన ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న తల్లిదండ్రులు గాయపడిన తమ పిల్లలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతి వేగమా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు.

First Published:  2 July 2024 7:14 AM GMT
Next Story