Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఓటమిని తట్టుకోలేక..

వైసీపీ ఓటమి తర్వాత జగన్ అభిమానులు చాలామంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం మహిళలు కన్నీరు మున్నీరవుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైసీపీ ఓటమిని తట్టుకోలేక..
X

ఏపీ ప్రజలు చాలా సున్నిత మనస్కులు. తమ కుటుంబ సభ్యులకే కాదు, తాము అభిమానించే నాయకులకు ఏమాత్రం చెడు జరిగినా తట్టుకోలేరు. ఆ బాధలో కొంతమందికి గుండెపోటు రావొచ్చు, మరికొందరు ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడొచ్చు. ఇటీవల కాలంలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. ఆ వార్త తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులకోసం నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర చేపట్టారు. వారికి ఆర్థిక సాయం కూడా అందించారు. ఇదంతా కేవలం ప్రచారం కోసం చేసిన జిమ్మిక్కు అంటూ వైసీపీ ఆరోపించినా.. టీడీపీ అవేమీ పట్టించుకోలేదు. తాజాగా ఈ పరామర్శల పర్వం వైసీపీలో మొదలైంది. తన ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఓ అభిమాని కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అటు మాజీ మంత్రి కొడాలి నాని పరాజయాన్ని జీర్ణించుకోలేక గుడివాడ మండలం సైదేపూడికి చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని కొడాలి నాని పరామర్శించారు. రూ.5లక్షలు ఆర్థిక సాయం చేశారు.



వైసీపీ ఓటమితో..

వైసీపీ ఓటమి తర్వాత జగన్ అభిమానులు చాలామంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాదిమంది ప్రజలకు మంచి చేసిన జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని, వైసీపీ ఓటమికి కారణం ఏంటో తెలియడం లేదని అంటున్నారు. జగన్ కోసం మహిళలు కన్నీరు మున్నీరవుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



అన్నం తినకుండా..

వైసీపీ ఓటమితో మరికొందరు అభిమానులు అన్నం మానేశారు. ఫలితాల తర్వాత వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంకొందరు అభిమానులు ఆవేదనతో గుండెపోటుకు గురై మరణించారని సాక్షి కథనం ప్రచురించింది.



First Published:  8 Jun 2024 11:59 AM GMT
Next Story