Telugu Global
Cinema & Entertainment

కమిట్‌మెంట్‌ వ్యాఖ్యలపై స్పందించిన అనన్య నాగళ్ల

సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నానని చెప్పిన నటి

కమిట్‌మెంట్‌ వ్యాఖ్యలపై స్పందించిన అనన్య నాగళ్ల
X

అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'పొట్టేల్‌' అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఆమె వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో అనన్యకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కమిట్‌మెంట్‌ను ఎదుర్కొన్నారా? అని ఓ జర్నలిస్ట్‌ ఆమెను ప్రశ్నించారు. ఇది ఇండస్ట్రీలోనే కాదు, సోషల్‌ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఈ అంశంపై అనన్య స్పందించారు.

సున్నితమైన అంశంపై వేదికపై ఉన్న నటిని ఇంత డైరెక్ట్‌గా ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. 'సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా' అనుకున్నాను. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కలం. ఐదేళ్ల నుంచి దీనికోసం నేను ఇంట్లో ఫైట్‌ చేస్తున్నాను. ఇండస్ట్రీలోకి వెళ్లి కుటుంబం పరువు తీసేసింది అని కొందరు ఆలోచిస్తుంటారు. కానీ 'పొట్టేల్‌' చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లంతా గర్వంగా ఫీలవుతారనుకున్నాను. ఇంత గొప్ప మూవీలో మా అమ్మాయి నటించిందని మా అమ్మ అందరితో చెబుతారని చాలా ఆనందించాను. అలాంటప్పుడు ఈ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు సక్సెస్‌ అయినా.. కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టే సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులంతా ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్‌ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా! ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించానని చెప్పారు. అయితే ఈ విషయంలో తనకు మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని అనన్య అన్నారు. మరోవైపు జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు అనన్య తనదైన శైలిలో సమాధానం చెప్పడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి.

First Published:  22 Oct 2024 8:13 AM GMT
Next Story