Telugu Global
Andhra Pradesh

ఏపీకి అదానీ గ్రూప్‌ రూ. 25 కోట్ల భారీ విరాళం

భారీ వర్షాలు, వానలతో నష్టపోయిన ఏపీకి ఆపన్న హస్తం అందించడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చినట్లు సమాచారం.

ఏపీకి అదానీ గ్రూప్‌ రూ. 25 కోట్ల భారీ విరాళం
X

భారీ వర్షాలు, వరదలతో విలవిల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయడానికి అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్‌ రూ. 25 కోట్లు సాయం ప్రకటించింది. ఈ మేరకు గౌతమ్‌ అదానీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అపార నష్టాన్ని చవిచూసిన ఏపీని ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ మొదటివారంలో భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు వరద నీటిలో మునిగిన విషయం విదితమే. బుడమేరు వాగుకు పడిన గండ్ల కారణంగా విజయవాడ నగరం నీట మునిగింది. ముంపు ప్రాంత ప్రజలు సుమారు వారం రోజుల పాటు నీళ్లలోనే ఉన్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది వరద ప్రభావానికి లోనయ్యారు . ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల 40 మంది చనిపోగా.. వందల సంఖ్యలో పశుపక్షాదులు మృత్యువాతపడ్డాయి. ఏపీలో వరద బాధితులకు అండగా నిలువడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేకమంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు.

First Published:  20 Sep 2024 12:52 AM GMT
Next Story