Telugu Global
NEWS

ఆ శక్తి జగన్‌కు మాత్రమే ఉంది.... అందుకే చేరా....

టీడీపీ అరాచక పాలనకు అంతం పలకకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం కాదన్నారు వైసీపీలో చేరిన మాజీ మంత్రి సి. రామచంద్రయ్య. టీడీపీ అరాచక పాలనకు అడ్డుకట్ట వేసే శక్తి జగన్‌లో ఉందనే తాను వైసీపీలో చేరానన్నారు. జగన్‌ లాంటి నాయకులకు మద్దతు పలికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్షణాలు చంద్రబాబులో కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, వారి చేత మంత్రులుగా ప్రమాణం చేయించడం వంటివి చేసిన వ్యక్తికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే […]

ఆ శక్తి జగన్‌కు మాత్రమే ఉంది.... అందుకే చేరా....
X

టీడీపీ అరాచక పాలనకు అంతం పలకకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం కాదన్నారు వైసీపీలో చేరిన మాజీ మంత్రి సి. రామచంద్రయ్య. టీడీపీ అరాచక పాలనకు అడ్డుకట్ట వేసే శక్తి జగన్‌లో ఉందనే తాను వైసీపీలో చేరానన్నారు.

జగన్‌ లాంటి నాయకులకు మద్దతు పలికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్షణాలు చంద్రబాబులో కనిపించడం లేదన్నారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, వారి చేత మంత్రులుగా ప్రమాణం చేయించడం వంటివి చేసిన వ్యక్తికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని సి. రామచంద్రయ్య ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ – టీడీపీ పొత్తు పూర్తిగా అనైతికమన్నారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిసిన రామచంద్రయ్య అనుచరులతో పాటు వైసీపీలో చేరారు. నాటి తెలుగుదేశం ఇప్పుడు లేదన్నారు.

రాహుల్‌ గాంధీకి ఏమీ తెలియదని అందుకే అతడి పంచన చంద్రబాబు చేరారన్నారు. వైసీపీలోకి వచ్చేందుకు చాలా మంది కాంగ్రెస్‌ నేతలు సిద్దంగా ఉన్నారని వివరించారు.

First Published:  13 Nov 2018 3:49 AM GMT
Next Story