Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారు...

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రోబో 2.0 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయ సినీచరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూను 350కోట్ల రూపాయలుగా తేల్చారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ విలువ మరో 50కోట్ల రూపాయలు పెరగవచ్చని అంచనా. ఇంత భారీ బడ్జెట్ తో ఓ సీక్వెల్ ను నిర్మిస్తున్నాడు శంకర్. ఎక్కడా, ఏ సన్నివేశం దగ్గర రాజీ పడడం లేదు. తాజాగా ఓ […]

రజనీకాంత్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారు...
X

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రోబో 2.0 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయ సినీచరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూను 350కోట్ల రూపాయలుగా తేల్చారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ విలువ మరో 50కోట్ల రూపాయలు పెరగవచ్చని అంచనా. ఇంత భారీ బడ్జెట్ తో ఓ సీక్వెల్ ను నిర్మిస్తున్నాడు శంకర్. ఎక్కడా, ఏ సన్నివేశం దగ్గర రాజీ పడడం లేదు. తాజాగా ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం కోట్లు ఖర్చుపెట్టారు.

చెన్నై శివార్లలో రోబో 2.0కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. రెండు స్పోర్ట్స్ కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొంటాయి. తర్వాత భారీ పేలుడు సంభవిస్తుంది. ఈ సన్నివేశంలో యుద్ధ ట్యాంకులు కూడా కనిపిస్తాయి. ఈ సీన్ ను 3 రోజుల పాటు భారీ స్థాయిలో తెరకెక్కించారు. హీరో రజనీకాంత్, విలన్ అక్షయ్ కుమార్ ఎవరూ ఈ సన్నివేశంలో లేరు. అయినప్పటికీ, ఖర్చుకు వెనకాడకుండా దీన్ని తెరకెక్కించారు. త్వరలోనే చెన్నైలో మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న రోబో 2.0 సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Click to read

తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం

First Published:  1 Sep 2016 11:48 PM GMT
Next Story