గుండెకు అనారోగ్యం ఉంటే...డెంగ్యూ మరింత ప్రమాదకరం!
గుండెవ్యాధి ఉన్నవారికి డెంగ్యూ వస్తే అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ జ్వరం సోకినవారికి ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోలేకపోవటం, విపరీతమైన అలసట లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఇసిజి, ఎకో పరీక్షలు చేయించాలని, గుండె ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని వారు చెబుతున్నారు. ఒక పరిశోధనా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని న్యూఢిల్లీలోని ఫార్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్ లోని క్లినికల్ రీసెర్చి అండ్ అకడెమిక్స్ డీన్ ఉపేంద్ర కౌల్ తెలిపారు. అంతకుముందు గుండెకు […]

గుండెవ్యాధి ఉన్నవారికి డెంగ్యూ వస్తే అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ జ్వరం సోకినవారికి ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోలేకపోవటం, విపరీతమైన అలసట లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఇసిజి, ఎకో పరీక్షలు చేయించాలని, గుండె ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని వారు చెబుతున్నారు. ఒక పరిశోధనా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని న్యూఢిల్లీలోని ఫార్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్ లోని క్లినికల్ రీసెర్చి అండ్ అకడెమిక్స్ డీన్ ఉపేంద్ర కౌల్ తెలిపారు.
అంతకుముందు గుండెకు సంబంధించిన సమస్యలు లేకపోయినా డెంగ్యూ సోకినపుడు పేషంట్ల ఇసిజి, ఎకో పరీక్షల్లో తేడాలు కనిపించాయని, ఇక గుండె సమస్యలు ఉండి, డెంగ్యూకి గురయితే వారికి చికిత్స కష్టతరంగా మారుతున్నదని ఆయన అన్నారు. డెంగ్యూ సోకినవారిలో… గుండె కొన్ని సమస్యలకు గురవటం కనుగొన్నామని, సరైన చికిత్సా విధానాలతో వీటిని అధిగమించవచ్చని…అయితే ఇలాంటి ప్రమాదం ఒకటుందని…డెంగ్యూచికిత్సలో మర్చిపోకూడదని ఉపేంద్ర తెలిపారు.