ఛత్తీస్ గడ్ లో మతం మారిన పదివేల మంది..
ఛత్తీస్ గడ్ లో మొన్న జరిగిన దీక్షా సభలో పదివేల మంది బౌద్ధ మతం స్వీకరించారు. 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో ఏర్పాటు చేసిన ధమ్మదీక్షా కార్యక్రమంలో అంబేద్కర్ ఆధ్వర్యాన ఒకే రోజు, ఒకే చోట, ఒకే సారి 5 లక్షల మంది హిందూ మతం నుంచి బౌద్ధాన్ని స్వీకరించారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు కాన్షీరాం శిష్యుడు విజయ్ మాంకార్ ఆధ్వర్యంలో 10వేల మంది బౌద్ధాన్ని స్వీకరించటం ఒక ఛారిత్రిక సంఘటన. ఈ కార్యక్రమంలో […]
BY sarvi16 Sept 2015 1:25 PM IST

X
sarvi Updated On: 18 Sept 2015 6:03 AM IST
ఛత్తీస్ గడ్ లో మొన్న జరిగిన దీక్షా సభలో పదివేల మంది బౌద్ధ మతం స్వీకరించారు. 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో ఏర్పాటు చేసిన ధమ్మదీక్షా కార్యక్రమంలో అంబేద్కర్ ఆధ్వర్యాన ఒకే రోజు, ఒకే చోట, ఒకే సారి 5 లక్షల మంది హిందూ మతం నుంచి బౌద్ధాన్ని స్వీకరించారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు కాన్షీరాం శిష్యుడు విజయ్ మాంకార్ ఆధ్వర్యంలో 10వేల మంది బౌద్ధాన్ని స్వీకరించటం ఒక ఛారిత్రిక సంఘటన. ఈ కార్యక్రమంలో విజయ్ మాంకార్ ఆ పది వేల మంది చేత త్రిశరణ, పంచశీలాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించాడు. త్వరలో కేరళ, మహారాష్ట్రల్లో కూడా ఇలాంటి మతమార్పిడి సభలు జరగనున్నట్టు తెలుస్తోంది.
Next Story