మంత్రి అచ్చెన్నాయుడుతో బాలకృష్ణ భేటీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. హిందూపురంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. స్టేడియం నమూనాను అచ్చెన్నాయుడుకు అందజేశారు. పీపీపీ పద్ధతిలో ఈ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోనని, హిందూపురంతో సహా అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలో తన నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తానని బాలకృష్ణ హామీనిచ్చారు.
BY sarvi18 Aug 2015 6:42 PM IST
sarvi Updated On: 19 Aug 2015 9:20 AM IST
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. హిందూపురంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. స్టేడియం నమూనాను అచ్చెన్నాయుడుకు అందజేశారు. పీపీపీ పద్ధతిలో ఈ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోనని, హిందూపురంతో సహా అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలో తన నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తానని బాలకృష్ణ హామీనిచ్చారు.
Next Story