'శేషాచలం' బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చిన జయ
శేషాచల ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక దారి చూపాలంటూ సీఎం జయలలితను కొన్ని రోజులుగా బాధిత కుటుంబాలు వేడుకుంటున్న నేపథ్యంలో గురువారం 20 కుటుంబాలకు చెందిన ఒక్కో వ్యక్తిని పలు రకాల ఉద్యోగాల్లో ప్రభుత్వం […]
BY sarvi6 Aug 2015 6:45 PM IST

X
sarvi Updated On: 7 Aug 2015 7:19 AM IST
శేషాచల ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక దారి చూపాలంటూ సీఎం జయలలితను కొన్ని రోజులుగా బాధిత కుటుంబాలు వేడుకుంటున్న నేపథ్యంలో గురువారం 20 కుటుంబాలకు చెందిన ఒక్కో వ్యక్తిని పలు రకాల ఉద్యోగాల్లో ప్రభుత్వం వారిని నియమించినట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు.బాధిత కుటుంబాలకు చెందిన 17 మందిని వంట సహాయకులుగా, మరో ఇద్దరిని పోషకాహార సమన్వయకర్తలుగా నియమించారు. ఒకరిని అంగన్ వాడీ సహాయకులుగా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story