Telugu Global
Others

ఏపీలో మాకు గౌర‌వం ద‌క్క‌ట్లేదు: మేక‌పాటి 

ప్ర‌తిపక్షానికి చెందిన పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌రైన గౌర‌వం ఇవ్వ‌ట్లేద‌ని వైఎస్సార్ సీపీ పార్ల‌మెంట‌రీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి లోక్‌స‌భ స్పీక‌రుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి పనుల శిలాఫ‌ల‌కాల మీద అధికార పార్టీ  కార్పోరేట‌ర్ల పేర్లు వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష ఎంపీల పేర్లు రాయ‌డం లేద‌ని స్పీక‌రుకు చెప్పారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా  స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వెంక‌య్య నాయుడు అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రాలో […]

ప్ర‌తిపక్షానికి చెందిన పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌రైన గౌర‌వం ఇవ్వ‌ట్లేద‌ని వైఎస్సార్ సీపీ పార్ల‌మెంట‌రీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి లోక్‌స‌భ స్పీక‌రుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి పనుల శిలాఫ‌ల‌కాల మీద అధికార పార్టీ కార్పోరేట‌ర్ల పేర్లు వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష ఎంపీల పేర్లు రాయ‌డం లేద‌ని స్పీక‌రుకు చెప్పారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వెంక‌య్య నాయుడు అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రాలో జ‌రుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌ను మేక‌పాటి స్పీక‌రు దృష్టికి తీసుకు వ‌చ్చారు. గోదావరి మ‌హా పుష్క‌రాల ప్రారంభం రోజున జ‌రిగిన తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన 29 మందికే కాకుండా, పుష్క‌రాల నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో మ‌ర‌ణించిన వారికి కూడా పార్ల‌మెంటులో నివాళి అర్పించాల‌ని ఆయ‌న స్పీక‌రును కోరారు.
First Published:  20 July 2015 1:08 PM GMT
Next Story