Telugu Global
Others

4 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం హామీ: బాబు

విజయవాడ, జూన్ 2: నాలుగు ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను ప్రారంభించిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గన్నవరం టెర్మినల్‌తో ఇకపై దుబాయ్‌, సింగపూర్‌, హంకాంగ్‌, మలేషియా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. గోదావ‌రి పుష్కరాల స‌మ‌యానికి రాజమండ్రి ఎయిర్‌పోర్టు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దగదర్తి, నెల్లూరు, కుప్పం, ఓర్వకల్లులో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్టు చంద్రబాబు తెలిపారు.

విజయవాడ, జూన్ 2: నాలుగు ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను ప్రారంభించిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గన్నవరం టెర్మినల్‌తో ఇకపై దుబాయ్‌, సింగపూర్‌, హంకాంగ్‌, మలేషియా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. గోదావ‌రి పుష్కరాల స‌మ‌యానికి రాజమండ్రి ఎయిర్‌పోర్టు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దగదర్తి, నెల్లూరు, కుప్పం, ఓర్వకల్లులో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్టు చంద్రబాబు తెలిపారు.
First Published:  1 Jun 2015 6:48 PM IST
Next Story