ఆవుపాలు దూడలకే... వినూత్న ప్రదర్శన
ప్రతి తల్లీ తన పిల్లలకు పాలను తాగిస్తున్నట్లే ప్రతి ఆవు దాని పాలను దూడలకు మాత్రమే చెందే విధంగా మనుషులు కృషి చేయాలని, ఇలాంటి మార్పు సమాజంలో రావాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఐమాక్స్ వద్ద వినూత్న ప్రదర్శనను నిర్వహించింది. చిన్నారులకు ఆవులను పోలే దుస్తులను ధరింప జేసి వాటి పాలను కేవలం దూడలకే అందించాలని సూచిస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి ఐమాక్స్తో పాటు ఆ మార్గంలో వెళ్తున్న వారిని […]
BY Pragnadhar Reddy8 May 2015 6:50 PM IST

X
Pragnadhar Reddy Updated On: 9 May 2015 2:42 AM IST
ప్రతి తల్లీ తన పిల్లలకు పాలను తాగిస్తున్నట్లే ప్రతి ఆవు దాని పాలను దూడలకు మాత్రమే చెందే విధంగా మనుషులు కృషి చేయాలని, ఇలాంటి మార్పు సమాజంలో రావాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఐమాక్స్ వద్ద వినూత్న ప్రదర్శనను నిర్వహించింది. చిన్నారులకు ఆవులను పోలే దుస్తులను ధరింప జేసి వాటి పాలను కేవలం దూడలకే అందించాలని సూచిస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి ఐమాక్స్తో పాటు ఆ మార్గంలో వెళ్తున్న వారిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పెటా ప్రతినిధి భువనేశ్వరి గుప్త మాట్లాడుతూ మే-10న మాతృ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆవు పాలు దూడలకే దక్కాలని తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
Next Story