మరుభూమిని తలపిస్తున్న నేపాల్లో... మృతులు 3000!
మరుభూమిని తలపిస్తున్నట్టుంది నేపాల్… ఇప్పటికి 2100 మంది శవాలను బయటికి తీశారు. మరో వెయ్యి వరకు శిథిలాల కింద ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నుంచి మృతదేహాలను తీస్తూనే ఉన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. గుండెలరచేతిలో పెట్టుకుని రాత్రంతా గడిపారు జనం. ఉదయం మళ్ళీ మరోసారి భూమి కంపించింది. మధ్యాహ్నం 12.15 సమయంలో వచ్చిన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 7.2 గా నమోదైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. నేపాల్కు 80 కిలోమీటర్ల […]

మరుభూమిని తలపిస్తున్నట్టుంది నేపాల్… ఇప్పటికి 2100 మంది శవాలను బయటికి తీశారు. మరో వెయ్యి వరకు శిథిలాల కింద ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నుంచి మృతదేహాలను తీస్తూనే ఉన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. గుండెలరచేతిలో పెట్టుకుని రాత్రంతా గడిపారు జనం. ఉదయం మళ్ళీ మరోసారి భూమి కంపించింది. మధ్యాహ్నం 12.15 సమయంలో వచ్చిన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 7.2 గా నమోదైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. నేపాల్కు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనల కేంద్రం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ ప్రకంపనల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ ప్రకంపనలు ఒక వారంపాటు వస్తూనే ఉంటాయని వారంటున్నారు.