Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, July 13
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Editor's Choice

    దళిత మంత్రికి ఘోర అవమానం

    By Naveen KameraJanuary 11, 20252 Mins Read
    దళిత మంత్రికి ఘోర అవమానం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    దళిత మంత్రికి ఘోర అవమానం జరిగింది. మంత్రికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఉస్మానియా హాస్పిటల్‌ కొత్త భవన నిర్మాణంపై సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ చేశారు. హెల్త్‌ మినిస్టర్‌ దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ లోనే ఉన్నా మర్యాద కోసమైనా ఆయనను సమావేశానికి రావాలని పిలువలేదు. శనివారం తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కొత్త భవన నిర్మాణంపై రివ్యూ చేశారు. గోషామహల్‌ గ్రౌండ్స్‌ లో కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి ఈనెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్‌ పార్టీలోనే దామోదర కొనసాగారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా హస్తం పార్టీ జెండా మోశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో ఒకరు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్‌ కు కొత్త బిల్డింగ్‌ నిర్మించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న బిల్డింగ్‌ హెరిటేజ్‌ స్ట్రక్షర్‌ కావడంతో దానిని సంరక్షించాలని కోరుతూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

    పోలీస్‌ శాఖ అధీనంలో ఉన్న స్థలం బదలాయింపు సహా ఇతర ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంత కీలకమైన సమావేశానికి మంత్రిని ఎందుకు పిలువలేదన్న చర్చ సెక్రటేరియట్‌తో పాటు గాంధీ భవన్‌ లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఉస్మానియా కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన సమావేశం గురించి మంత్రి పేషి ఆరా తీయగా.. ఇది ఓన్లీ ఆఫీసర్స్‌ మీటింగ్‌ అని సీఎంవో నుంచి సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ భవన నిర్మాణానికి టెండర్లు పిలవాల్సింది, భవనం నిర్మించాల్సింది ఆర్‌ అండ్‌ బీ డిపార్ట్‌మెంట్‌. సంబంధిత శాఖ మంత్రికి కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రిగా ఉన్న మరో సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి ఈ సమావేశానికి ఆహ్వానం లేదని తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ భవన నిర్మాణం అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమే తప్ప.. సీఎం సొంత వ్యవహారం కాదు. ప్రభుత్వం అన్నప్పుడు ఏ నిర్ణయమైనా కేబినెట్‌ కలెక్టివ్‌గా తీసుకోవాలి. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు సంబంధిత శాఖ మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. కానీ సీఎం రేవంత్‌ రెడ్డి ఆ సంప్రదాయాలను పక్కన పెట్టి ప్రభుత్వం అంటేనే తాను అన్నట్టుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

    New Building construction Osmania Medical College
    Previous Articleగ్రీన్‌ ఎనర్జీ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు
    Next Article తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
    Naveen Kamera

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.