Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్‌

    By Raju AsariFebruary 3, 20252 Mins Read
    ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్‌ పిటిషన్‌పై జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్‌కు ధర్మాసనం జత చేసింది. ఈ పిటిషన్‌ను దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్‌తో కలిపిఈ నెల 10న పాత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ వేసిన ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ప్రతివాదులైన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి అందజేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపుడి గాంధీ, గూడెం మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీ బీఫామ్‌ పై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరినా ఇప్పటివరకు స్పీకర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్‌ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు.

    పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించడానికి హేతుబద్ధంగా ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను కోరిన విషయం విదితమే. వారం రోజుల్లోపు స్పీకర్‌ నిర్ణయాన్ని తమకు తెలుపాలని అసెంబ్లీ కార్యదర్శి ముకుల్‌ రోహత్గీకి సూచించింది. తమ పార్టీ తరఫన గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తగిన సమయంలో లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ గత నవంబర్‌ 22న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్మే పాడి కౌశిక్‌ రెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలోలా పదవీ కాలం ముగిసే వరకా అని ప్రశ్నించింది. అందుకే రోహత్గీ బదులిస్తూ స్పీకర్‌ ఈ ఏడాది జనవరిలో కార్యాచరణ మొదలుపెట్టారని పేర్కొనగా.. అందుకు ఎంత సమయం కావాలో మీరే చెప్పాలని న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి ప్రశ్నించారు. స్పీకర్‌ను అడిగి చెబుతామని, రెండు వారాల సమయం ఇవ్వాలని అడగ్గా.. వారం రోజుల సమయం మాత్రమే సమయం ఇస్తూ న్యాయమూర్తి వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను కూడా అదే రోజు విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.

    MLAs Disqualification Case Supreme Court
    Previous Articleభక్తజనసంద్రమైన ప్రయాగ్ రాజ్
    Next Article బీసీ జనాభాపై కాంగ్రెస్‌ పెద్ద కుట్ర
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.