తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ భౌతికకాయనికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యేహరీశ్ రావు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సత్యనారాయణ తన దైన ముద్ర వేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో వారి కృషి, బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయమన్నారు.స త్తన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు
Previous Articleఅప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి..బ్యాంకు అధికారుల దౌర్జన్యం
Keep Reading
Add A Comment