Telugu Global
Telangana

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి తృటిలో తప్పిన ప్రమాదం

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది.

జీహెచ్‌ఎంసీ మేయర్  విజయలక్ష్మికి తృటిలో తప్పిన ప్రమాదం
X

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఫుట్ పాత్ పై కాలు జారి కింద పడ్డారు. కిందపడ్డ మేయర్‌ను పక్కనే ఉన్న హైదరాబాద్‌ ఇంఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్‌ శ్రీలత రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఓదార్చారు. అనంతరం స్వల్ప గాయాలతో మేయర్‌ తన పాదయాత్రను కొనసాగించారు. దీంతో మేయర్‌కు స్వల గాయమైనట్లు తెలుస్తోంది.

First Published:  3 Feb 2025 8:20 PM IST
Next Story