Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, July 18
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    సమస్యలకు కేరాఫ్ గా కాంగ్రెస్‌ ఏడాది పాలన

    By Raju AsariJanuary 21, 20253 Mins Read
    సమస్యలకు కేరాఫ్ గా కాంగ్రెస్‌ ఏడాది పాలన
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పదేళ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ ఏడాది కాలంగా సమస్యలకు కేరాఫ్ గా మారిందని..రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది. రోజురోజుకూ పెరిగిపోతున్న పారిశుధ్య సమస్య, తాగునీటి తండ్లాట, విద్యుత్ కోతలు, ట్రాఫిక్ సమస్య తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, పించన్లు, ఇళ్లు ఇచ్చే వరకూ పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

    హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంగా నిత్యం ఎదుర్కుంటున్న సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న పారిశుద్ధ్య ఇబ్బందులను, తాగునీటితోపాటు ఇతర సమస్యలను ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎండాకాలం రాకముందే అనేక ఏరియాల్లో వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్న సంగతిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. దీంతో పాటు బీఆర్ఎస్ పాలనలో సేఫ్ సిటీకి బ్రాండ్ గా ఉన్న హైదరాబాద్, క్రైమ్ సిటీగా మారడం, మళ్లీ పెరుగుతున్న భూకబ్జాలతో పాటు గాలికొదిలేసిన లా అండ్ ఆర్డర్ తో నగర ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అభద్రతాభావంపై కేటీఆర్ తో ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమస్యల పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

    ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు పాలన చేతకాదని ప్రజలకు అర్థమైపోయింది, తెలంగాణ గ్రోత్ ఇంజన్ ను కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ ఏడాదికాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు.సీఎంగా కేసీఆర్ సారథ్యంలో హైదరాబాద్ సంతోషానికి చిరునామాగా ఉంటే.. నేడు రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యంతో సవాలక్ష కష్టాలకు కేరాఫ్ గా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.

    బీఆర్ఎస్‌ పాలన హైదరాబాద్ నగరానికి స్వర్ణయుగమని మెట్రో రైలు, సివరేజీ ప్రాజెక్టులు, ఐటీ వృద్ధి, ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు నగర రూపురేఖల్ని మార్చి దేశానికే గర్వకారణంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దామన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలుచేసిన సమగ్రమైన ప్రణాళికలతో హైదరాబాద్ లో శాంతిభద్రతలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడాలన్న సోయి కూడా లేకపోవడం దురదృష్టకరం అన్నారు. నియోజక వర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న దురావస్థ గురించే హైదరాబాదీలు చెబుతున్నారని ఎమ్మెల్యేలు కేటీఆర్ కు వివరించారు. ప్రధానంగా బస్తీ వాసులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్ లో అమలుకావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా హైదరాబాద్ లోని పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ రూపురేఖల్ని సమూలంగా మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ వాసుల విలువైన సమయాన్ని ఆదా చేసే విధంగా వందేళ్ళ ముందు చూపుతో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టామని, కరోనా సమయంలో కూడా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తిచేసి ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లను హైదరాబాదులో వాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

    కొత్త రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్ని తీర్చి హైదరాబాద్ వాసుల అభిమానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించుకుందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి తాము నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా చేతకావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యమయ్యాని మండిపడ్డారు. చెత్త సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆటోల ప్రయోగంతో విప్లవాత్మకమైన ఫలితాలను సాధించగలిగామని కేటీఆర్ చెప్పారు. కానీ నేడు హైదరాబాద్ లోని ఏ కాలనీ కి వెళ్లి చూసిన ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కనిపిస్తుందన్నారు. ఫలితంగా ఈగలు, దోమల సమస్య పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    బీఆర్ఎస్ హయంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కూడా రేవంత్ సర్కార్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, అనేకచోట్ల కబ్జాలకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా సామర్థ్యంపై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఆయనకు పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్ వాసులు పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు.గత ఎన్నికల్లో కుల,మత, ప్రాంతాలకు అతీతంగా హైదరాబాదీలంతా పదేళ్ల అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీలతో గెలిపించారు. హైదరాబాద్‌ ప్రజల నమ్మకానికి అనుగుణంగా వారి కష్టాలను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.

    హైదరాబాద్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజన్ అయినా హైదరాబాద్ ఇమేజీ కాంగ్రెస్ పాలనలో దారుణంగా దెబ్బతిన్నదన్న కేటీఆర్, ఇది కేవలం హైదరాబాద్ కే కాకుండా యావత్ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. పదేళ్లపాటు దేశంలోనే మోస్ట్ లవబుల్ సిటీ గా, లివెబుల్ సిటీగా అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ర్యాంకింగ్ లో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ గాడి తప్పిన పాలన కారణంగా నేడు విలవిలలాడుతోందన్నారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ కు వెన్నుముక్కైన హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

    Held key Meeting KTR
    Previous Articleఏపీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలివే
    Next Article కృష్ణా నీళ్లపై సీఎం, మంత్రుల ఆరోపణలు తప్పని తేలిపోయింది
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.