సచివాలయాల స్టాఫ్ ని కూలీలుగా మార్చి, స్నాక్స్ అందించే డ్యూటీలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
YSRCP
విజయవాడలో ప్రతి చెట్టుని, ప్రతి వీధిని విద్యుత్ దీపాలతో అలంకరించారని, అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం మరచిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.
సోషల్ మీడియాలో అఫిషియల్ హ్యాండిల్స్ లో కూడా వినలేని, చదవలేని పదాలు వచ్చి చేరుతున్నాయి. నిక్కర్ మంత్రీ అని వైసీపీ సెటైర్ వేస్తే, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ మరింత దారుణమైన భాషలో బదులిస్తోంది.
చంద్రబాబులో భయం మొదలైందనడానికి ఇదే సంకేతమని చెప్పారు జగన్. టీడీపీ మెడలు వంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు.
ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు.. లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు జగన్.
మీ జగనే ముఖ్యమంత్రి అయితే ఈపాటికే అమ్మఒడి వచ్చేదని, సున్నా వడ్డీ సొమ్ము బ్యాంక్ లో జమ అయ్యేదని, రైతు భరోసా, విద్యా దీవెన కూడా వచ్చేదని, తాను సీఎం కాకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయాయని చెప్పారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటాననే భరోసా ఇచ్చేందుకే జగన్ విజయవాడ ఆస్పత్రికి వస్తున్నట్టు చెబుతున్నారు.
గతంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందో, అదే సెక్యూరిటీ కావాలంటున్నారు జగన్. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యమని టీడీపీ ప్రశ్నిస్తోంది.
ఏపీలో రోజురోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు.