ఇంకొంత మంది మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చి చల్లటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి అదే పని చేస్తారు. కానీ అది మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 42 డిగ్రీల ఎండ నమోదవుతుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.