ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ నగరంలోని ఓ హాస్పటల్ ప్రాంగణంలో నేలపైన నిద్రించారు. ఓ ప్రభుత్వ అధికారి చేత అత్యాచారానికి గురయిన బాలిక హాస్పటల్ లో ఉండగా పోలీసులు బాలికని ఆమె తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో స్వాతి ఆ పనిచేశారు. పోలీసులు గూండాయిజం చేస్తున్నారని ఆమె ఆరోపించారు