Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, May 17
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    భారత టీ-20 జట్టులో ఆంధ్రా ఆల్ రౌండర్!

    By Telugu GlobalJune 25, 2024Updated:March 29, 20252 Mins Read
    భారత టీ-20 జట్టులో ఆంధ్రా ఆల్ రౌండర్!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    జింబాబ్వే తో టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రా కుర్రాడు, యువఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు సంపాదించాడు.

    భారత టీ-20 జట్టుకు కొత్తరక్తం ఎక్కించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుత ప్రపంచకప్ తరువాత జింబాబ్వేతో జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టు కోసం 15 మంది యువఆటగాళ్లను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.

    జులై 6 నుంచి జింబాబ్వేతో సిరీస్…

    జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు యువఓపెనర్ శుభ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. ప్రస్తుత జట్టులోని సీనియర్ స్టార్లు ( రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా, జడేజా, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలిపారు.

    భారతజట్టులో చోటు సంపాదించిన నవతరం ఆటగాళ్లలో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

    జట్టులోని 15 మందిలో రితురాజ్ గయక్వాడ్, రింకూ సింగ్, సంజు శాంసన్ ( వికెట్ కీపర్ ), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్ పాండే ఉన్నారు.

    ఐపీఎల్ అనుభవంతో గిల్ కు కెప్టెన్సీ…

    ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించిన అనుభవం కలిగిన శుభ్ మన్ గిల్ కు భారతజట్టు పగ్గాలను అప్పగించారు. ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ తో రోహిత్, విరాట్ లాంటి పలువురు సీనియర్ స్టార్లు రిటైర్ కానున్న నేపథ్యంలో జట్టులో యువఆటగాళ్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ -17వ సీజన్ లో అద్భుతంగా రాణించిన నవతరం ప్లేయర్లంతా చోటు దక్కించుకోగలిగారు.

    చెన్నై ఓపెనింగ్ బౌలర్ గా 17 వికెట్లు పడగొట్టిన తుషార్ దేశ్ పాండే, రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్, ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్, స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ లతో పేస్ బౌలింగ్ ఎటాక్ ను సిద్ధం చేశారు.

    స్పిన్ బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ కీలకం కానున్నారు. వికెట్ కీపింగ్ లో సంజు శాంసన్, ధృవ్ జురెల్ బాధ్యతలు పంచుకోనున్నారు.

    తెలుగు కుర్రాళ్లకు మిశ్రమ ఫలితాలు…

    టీ-20 ఫార్మాట్లో అత్యంత ప్రతిభావంతులైన తెలుగు రాష్ట్ర్రాల క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. ముంబై ఫ్రాంచైజీకి ఆడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మను పక్కన పెట్టి..హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడుతున్న విశాఖపట్నం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి భారతజట్టులో చోటు కల్పించారు. హార్థిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్ రౌండర్ గా నితీశ్ కుమార్ ను తీర్చిదిద్దాలని ఎంపిక సంఘం నిర్ణయించింది. ఐపీఎల్- 17వ సీజన్ లో అత్యుత్తమ యువఆటగాడి అవార్డుకు ఎంపికైన నితీశ్ .జింబాబ్వే సిరీస్ ద్వారా సత్తా చాటుకోవాల్సి ఉంది.

    అసోం తొలి బ్యాటర్ రియాన్ పరాగ్…

    దేశవాళీ టీ-20 క్రికెట్ టోర్నీలతో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున వరుసహాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అసోం ఆటగాడు రియాన్ పరాగ్ ను ఎంపిక సంఘం ఎట్టకేలకు కరుణించింది. భారత టీ-20 జట్టులో తొలిసారిగా చోటు కల్పించింది.

    హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో ఓపెనర్ గా 484 పరుగులు సాధించడంతో పాటు పలు వికెట్లు సైతం పడగొట్టాడు.

    జింబాబ్వేలోని హారారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా 8 రోజుల వ్యవధిలో జులై 6 నుంచి 5 టీ-20 మ్యాచ్ ల్లో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారతజట్టు పోటీపడనుంది.

    Nitish Kumar Reddy Vizag Cricketer
    Previous Articleహిట్ మ్యాన్ హిట్’..భారత్ చేతిలో ఆస్ట్ర్రేలియా స్మాష్!
    Next Article ఆగస్టులో కేంద్రం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఓటీటీ?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.