కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో లివింగ్స్టన్ (41 32 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్ల రవీంద్ర జాడేజ మూడు వికెట్లు తీసుకున్నారు.తొలి వన్డేలో గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అయితే మ్యాచ్ గెలిచి ఆధిక్యాన్ని సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
Add A Comment