Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, June 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చు

    By Raju AsariFebruary 10, 20252 Mins Read
    ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ప్రధాని మోడీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 8వ ఎడిషన్‌ పరీక్షా పే చర్చ వీడియోను సోమవారం ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఢిల్లీలోని సుందరవనంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్దం కావాలన్నారు. ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చన్నారు. విద్యార్థులు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకర ఆహారం అవసరమని, అనారోగ్యకర ఆహారాలు మిమ్మల్ని నీరసం చేస్తాయన్నారు. దినచర్య, అధ్యయన సమయం రూపొందించుకోవాలన్నారు. విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలన్నారు. చిరుధాన్యాల ప్రాధాన్యం గురించి ప్రధాని విద్యార్థులకు వివరించారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ప్రధాని మోడీ సూచనలు చేశారు. 

    ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్‌

    ప్రతి విద్యార్థికి భిన్నమైన టాలెంట్‌ ఉంటుంది. కొంతమంది చదువులో ముందుంటారు. మరికొందరికి మంచి డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఉంటుంది. విద్య సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించింది. విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. వారు తమ అభిరుచుల వైపు మళ్లేందుకు స్వేచ్ఛ అవసరం. పరీక్షలే సర్వస్వం అనే భావనలో జీవించకూడదు. పిల్లలకు సలహాలు ఇవ్వకూడదు. వారిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గమనించాలి. వారిలో ఉన్న విశిష్టమైన ప్రతిభను వెలికితీయాలి అని చిన్నారులు, టీచర్లకు మోడీ సూచించారు.

    సమయ పాలన అన్నింటకంటే ముఖ్యం

    సమయ పాలన అన్నింటకంటే ముఖ్యమన్నారు. మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో ఒక కాగితం మీద రాసుకోవాలి. ఏ పని కోసం ఎంత సమయం వెచ్చించాలో ఆలోచించుకోండి. మీకు ఇష్టమైన సబ్జెక్టుకు ఎక్కువ సమయం, ఇష్టం లేని దానికి తక్కువ సమయం కేటాయించొద్దు. దాన్ని భిన్నంగా చేయండి. కష్టమైన పాఠ్యాంశాన్ని ఒక సవాలుగా స్వీకరించండి అని సలహా ఇచ్చారు. స్నేహితుల్లో మంచి లక్షణాలు గమనించండి. దానివల్ల ప్రతి పనిలో సానుకూలతను చూసే అలవాటు పెరుగుతుంది. ఇక స్నేహితుల కష్టాలను అర్థం చేసుకోవడానికి వారితో మాట్లాడండి అన్నారు.

    ఆశ్చర్యపోయిన ప్రధాని

    కేరళ నుంచి వచ్చిన విద్యార్థి ఆకాంన్షా ప్రధాని మోడీని హిందీలో పలకరించారు. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన ఇంత చక్కగా హిందీ ఎలా నేర్చుకున్నావంటూ ప్రశ్నించారు. నాకు హిందీ అంటే చాలా ఇష్టం.. నేనొక కవిత కూడా రాశానని దానిని చదివి వినిపించారు.

    Pariksha Pe Charcha 2025 PM Modi
    Previous Articleదాగుడుమూతలు ఎందుకు.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయండి
    Next Article త్రివేణి సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.