యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఐదోరోజు భక్తులు పోటెత్తుతున్నారు. తీవ్రమైన చలిలోనూ ఉదయం నుంచే ఘాట్ ల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా మొదలైన నాటి నుంచి త్రివేణి సంగమంలో ఇప్పటివరకు 7 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఒక్క గురువారం రోజునే 30 లక్షల మంది మహాకుంభమేళా హజరయ్యారని పేర్కొన్నది. మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తున్నది.