Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Crime

    మూఢ భక్తి : 47 మంది చావుకు కారణమైన పాస్టర్

    By Telugu GlobalApril 24, 20232 Mins Read
    మూఢ భక్తి : 47 మంది చావుకు కారణమైన పాస్టర్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మూఢ భక్తి 47 మంది ప్రాణాలను బలిగొంది. పాస్టర్ చెప్పిన మాటలు నమ్మి భక్తులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. కఠిన ఉపవాసం ఆచరిస్తే పరలోక ప్రాప్తి లభిస్తుందని పాస్టర్ చెప్పిన మాటలు నమ్మిన అమాయక భక్తజనం అతడు చెప్పిన మాటలు ఆచరించారు. కఠిన ఉపవాసం పాటించి తమ శరీరాన్ని శుష్కింప చేసుకుని చివరికి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన కెన్యాలో జరిగింది.

    కిల్ఫీ ప్రావిన్స్ లోని గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిలో ఒక పాస్టర్ ఏసుప్రభును కలుసుకోవాలంటే కఠినమైన ఉపవాసం చేయాలని తన వద్దకు వచ్చే భక్తులకు సూచించాడు. కఠిన ఉపవాసం పాటించి ఆకలితో అలమటించి చనిపోతే పరలోక ప్రాప్తి లభిస్తుందని భక్తులకు పాస్టర్ పదేపదే నూరి పోశాడు. పాస్టర్ చెప్పిన మాటలు నిజమని నమ్మిన చాలా మంది భక్తులు కఠిన ఉపవాసం పాటించడం ప్రారంభించారు.

    అలా కఠిన ఉపవాసం ప్రారంభించిన 47 మంది చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ పాస్టర్ తెల్లటి ప్లాస్టిక్ షీట్ లో చుట్టి షాకహోలా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టించాడు. అయితే అటవీ ప్రాంతంలో తరచూ శవాలు పూడ్చి పెట్టడం గమనించిన కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

    పోలీసులు ఈనెల 11వ తేదీన అటవీ ప్రాంతానికి చేరుకొని తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాలు జ‌రిపినా కొద్దీ శవాలు బయటపడుతుండటంతో పోలీసులు విస్తుపోయారు. తవ్వకాలు మరింత విస్తృతం చేయగా మొత్తం 47 మృతదేహాలు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి చనిపోయిన వ్యక్తుల వివరాలు కనుగొన్నారు. అందరూ ఒకే తీరున మృతి చెందడంపై ఆరా తీశారు. వీరందరూ ఒకే పాస్టర్ వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసేవారని తెలుసుకున్నారు.

    పోలీసులు పాస్టర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అతడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. కఠిన ఉపవాసం చేపట్టడంతోనే భక్తులు చనిపోయినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇంకా ఎవరైనా ఇటువంటి ఉపవాసంలో ఉన్నారా? అని అడిగి వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ భక్తులను కలువగా వారిలో చాలామంది ఉపవాసం ఆచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ భక్తుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మూఢ భక్తి కారణంగా ఏకంగా 47 మంది తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

    Police Recover
    Previous Articleసూడాన్ పోరులో 400 మందికి పైగా మరణం , 3,500 మందికి గాయాలు
    Next Article సిడ్నీ చ‌రిత్ర‌లోనే నీచ‌మైన రేపిస్ట్‌.. పాపం పండింది!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.