Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, July 8
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    ఆ దేశంలో మిలటరీకి, పారా మిలటరీకి మధ్య యుద్దం…. భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ

    By Telugu GlobalApril 16, 20231 Min Read
    ఆ దేశంలో మిలటరీకి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సుడాన్ దేశ మిలటరీ, పారామిలిటరీ బలగాల మధ్య ఉద్రిక్తతల మధ్య సుడాన్ రాజధాని నిరంతర కాల్పుల మోతతో హోరెత్తుతోంది. దాంతో సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవ్వరూ ఇంట్లో నుంచి బైటికి రావద్దని కోరింది.

    మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ ఖార్టూమ్, బహ్రీ పరిసరాలతో సహా అనేక ప్రాంతాలలో భారీ కాల్పుల శబ్దాలు వినిపించాయి.

    సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అధ్యక్ష భవనం, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ నివాసం, ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నాయి. ఉత్తర నగరమైన మెరోవ్, దక్షిణాన ఎల్-ఒబీద్‌లోని మరో రెండు విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు RSF ఒక ప్రకటనలో తెలిపింది.

    రాజధాని దక్షిణ భాగంలో RSF దళాలు తమ బలగాలపై తీవ్ర దాడి చేయడంతో తాము అలసిపోయామని దాంతో వారు విమానాశ్రయాలను ఆక్రమించుకున్నారని సూడాన్ ఆర్మీ తెలిపింది. సైన్యం RSFని “తిరుగుబాటు దళం”గా ప్రకటించింది.

    అక్టోబర్ 2021లో జరిగిన తిరుగుబాటులో సుడాన్ లో మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుండి అది సార్వభౌమ మండలి ద్వారా దేశాన్ని నడుపుతోంది. పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించే ప్రతిపాదిత కాలక్రమంపై సైన్యం, పారా మిలటరీ మధ్య కొన్ని వారాలుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్ళింది.

    దేశాన్ని మిలటరీనే పాలించాలని ఆర్మీ కోరుకుంటుండగా , పౌరప్రభుత్వానికి అధికారం అప్పగించాలని పారా మిలటరీ డిమాండ్ చేస్తోంది. పైగా పారా మిలటరీని సైన్యంలో కలిపేయాలన్న సైన్యాధి నేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ డిమాండ్ ను పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో వ్యతిరేకిస్తున్నారు.

    Advisory Indians
    Previous Articleఉద్యోగాలయినా వదిలేస్తాం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిందే
    Next Article లవ్ వాక్సిన్ ( కవిత)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.