Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    ఎట్ హోమ్.. ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన గవర్నర్ విందు

    By Telugu GlobalAugust 15, 20222 Mins Read
    ఎట్ హోమ్.. ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన గవర్నర్ విందు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్లు సంప్రదాయంగా ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత కొన్నాళ్లుగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో జరుపుతున్నారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది ఎట్‌ హోమ్‌ను నిర్వహించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం యధావిధిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈసారి జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ఆసక్తికరమైన కలయికల కోసం ఎదురు చూస్తుండటమే కారణం.

    విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపథం చేసిన చంద్రబాబు గత కొన్నాళ్లుగా సీఎం జగన్‌కు ఎదురు పడలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా కూడా చంద్రబాబు ఓటేసి వెళ్లిపోయారు. అక్కడ ఎవరని కలవలేదు. అయితే సోమవారం సాయంత్రం జరిగిన ‘ఎట్ హోమ్’లో ఇద్దరు నేతలు పాల్గొన్నా.. ఒకరిని ఒకరు పలకరించుకోలేదు.

    ఇక హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా గవర్నర్‌ నిర్వహించే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏకంగా గవర్నర్ తమిళిసై బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తమిళిసై కూడా తనకు గవర్నర్‌గా సరైన ప్రొటోకాల్ లభించడం లేదని ఏకంగా సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

    గత ఏడాది కరోనా కారణంగా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఉగాది వేడుకలు నిర్వహించినా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు కూడా సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కొన్నాళ్ల క్రితం తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా భుయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాత్రం కేసీఆర్ పాల్గొన్నారు.

    అయితే ఈ సారి ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ తన రాజ్‌భవన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు, జడ్జీలు మాత్రమే పాల్గొన్నారు. అయితే సీఎం ఎందుకు పాల్గొనలేదనే విషయంపై మాత్రం ఇంకా సీఎంవో ఎలాంటి ప్రకటన చేయలేదు.

    At Home Governor's
    Previous Articleఅంగ్ సాన్ సూకీ కి మ‌రో ఆరేళ్ళ జైలు శిక్ష విధించిన మిలిట‌రీ కోర్టు
    Next Article అన్నదమ్ముల అనుబంధం: జనగణమన గీతం వినిపించిన పాకిస్తానీ కళాకారుడు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.