‘గేమ్ ఛేంజర్’ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్ నిర్వాహకులపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రామ్చరణ్, శంకర్ కాంబోలో ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. దీని పైరసీ కాపీని ఏపీలో ఓ టీవీ ఛానల్లో ప్రసారం చేయడంతో కేసు నమోదైంది. ఈ మేరకు గాజువాక పోలీసులు, సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్పై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.
Add A Comment