ఇల్లు కూల్చేస్తామని హైడ్రా అధికారులు మార్కింగ్ చేయడంతో ఆందోళనకు గురైన వృద్ధురాలు బుచ్చమ్మ ఆత్మహత్యపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆమె ఆత్మహత్యపై 16063/IN/2024 కేసు నమోదు చేసింది. త్వరలోనే బుచ్చమ్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా అధికారులకు త్వరలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేయనుంది.
Add A Comment