Telugu Global
Andhra Pradesh

కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెల‌లు గ‌డుస్తున్నా ఇప్పటివరుకు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్
X

ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటై 4 నెల‌లు గ‌డుస్తున్నా ఇప్పటివరుకు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ష‌ర్మిల అన్నారు. 22 లోక్‌స‌భ సీట్ల‌కు గాను 21 సీట్లు గెలిచి ప్ర‌ధాని మోదీకి ఇచ్చిన హామీని నెర‌వేర్చినందుకు గ‌ర్వంగా ఉంద‌న్న మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్య‌ల‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ష‌ర్మిల కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ హామీ నెర‌వేర్చామ‌న్న మీరు ఏపీ ప్ర‌జ‌ల‌కు నెర‌వేర్చ‌ని హామీల గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ఫ్రాంక్లీ స్పీకింగ్ టీవీ షోలో మిమ్మ‌ల్ని చూడ‌డం చాలా బాగుంద‌ని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మీరు ఇచ్చిన హామీల‌పై మీ ఉద్దేశం ఏంటో స్ప‌ష్టంగా చెప్పాల‌ని అడిగారు. ఇక ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌తివారం దేశ రాజ‌ధాని ఢిల్లీకి ప‌రుగులు పెడుతున్న‌ప్ప‌టికీ ఒరిగిందేమీ లేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా నెర‌వేర‌లేద‌ని విమ‌ర్శించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు, విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్‌ల‌కు దిక్కులేకుండా పోయింద‌న్నారు. వాటి పురోగ‌తి ప‌నుల‌పై మంత్రి లోకేశ్ స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంద‌ని ష‌ర్మిల అన్నారు.

First Published:  16 Oct 2024 10:01 AM GMT
Next Story