Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, May 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా

    By Raju AsariJanuary 9, 20251 Min Read
    తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామరానారయణ రెడ్డి పరామర్శించారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం అనగాని మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యనా? సమన్వయ లోపమా? అనేది విచారణలో వెళ్లడవుతుందన్నారు.

    హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటన ప్రమాదామా.. కుట్రా? అనే కోణంలో విచారణ జరగుతున్నదన్నారు. ఎవరి వైఫల్యం ఉన్నది అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామన్నారు.

    వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యా, సమన్వయ లోపమా? అనేది విచారణలో వెల్లడవుతుందన్నారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పపంపుతామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ మంత్రి అనగాని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.

    టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వారు కూడా డిశ్చార్జి అవుతారని చెప్పారు. మృతదేహాలకు సత్వరమే పోస్టమార్టం నిర్వహించి వారి స్వస్థాలకు పంపుతామన్నారు. సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శిస్తారని కలెక్టర్‌ వివరించారు. 

    6 Dead Tirupati Stampede
    Previous Articleఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన అర్వింద్‌కుమార్‌
    Next Article ప్రియాంక.. రాహుల్‌లా కాదు
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.