Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    వర్షాలకు ఏపీ విలవిల.. విజయవాడ ఘటనలో నలుగురు మృతి

    By Telugu GlobalAugust 31, 20242 Mins Read
    వర్షాలకు ఏపీ విలవిల.. విజయవాడ ఘటనలో నలుగురు మృతి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో మొత్తం 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇంద్రకీలాద్రి వద్ద కూడా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ఘాట్ రోడ్ పై రాకపోకలను నియంత్రించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలవడంతో.. మూడు బస్సులు, ఒక లారీ అందులో చిక్కుకున్నాయి.

    మొగల్ రాజపురంలో ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు

    విజయవాడ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి భారీగా కురుస్తున్న వర్షం

    ఇళ్లపై విరిగిపడిన కొండచరియలను జోరువానలోనూ వెళ్లి పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్.. బాధితులతో మాట్లాడి అండగా ఉంటానని… pic.twitter.com/IeCun4AMls

    — YSR Congress Party (@YSRCParty) August 31, 2024

    విజయవాడ గుంటూరు మధ్య హైవే నీటమునిగింది. హైవేపై ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణాలకు సాహసించవద్దని చెబుతున్నారు పోలీసులు. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్‌ నగర్‌లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ బస్టాండ్‌ పరిసరాల్లోకి కూడా వరదనీరు చేరింది. రామవరప్పాడు రింగ్‌రోడ్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోగా, నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అటు గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు వరదనీటితో పొంగిపొర్లుతోంది. సమీపంలోని లోతట్టుప్రాంతాల్లోకి వరదనీరు వచ్చేసింది. ఇళ్లలోకి నీరు చేరింది. గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు నాయకులు వర్షాల్లో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.

    ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో, నడుము లోతు నీళ్లల్లో ఎమ్మెల్యే, భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. సహాయక చర్యలు చేపడుతూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్న అధికార యంత్రాంగం#AndhraPradesh pic.twitter.com/dTDDIOHDEh

    — Telugu Desam Party (@JaiTDP) August 31, 2024

    భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు.. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారాయన. వర్షాల కారణంగా సీఎం ఓర్వకల్లు పర్యటన రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో రైలు పట్టాలపైకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో ముందు జాగ్రత్తగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

    భారీ వర్షాల పై ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష.

    సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి…

    — Telugu Desam Party (@JaiTDP) August 31, 2024

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు(శనివారం) అర్ధరాత్రి ఈ వాయుగుండం విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

    Heavy rains rains in andhra pradesh
    Previous Articleపారా ఒలింపిక్స్ లో భారత’ బంగారు’ కొండ!
    Next Article ఆయుత్థాయ బౌద్ధ పర్యాటకుల్ని బుద్ధవనానికి రప్పించాలి
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.