Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, July 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ.. ఎందుకంటే..?

    By Telugu GlobalAugust 21, 20241 Min Read
    పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ.. ఎందుకంటే..?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మాజీ సీఎం జగన్ రెండు రోజులపాటు పూర్తిగా నేతలకు సమయం కేటాయించారు. ఈ రెండు రోజుల్లో అభిమానులు, కార్యకర్తలెవరూ తాడేపల్లిలోని కార్యాలయానికి రావొద్దని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజులపాటు నేతలతోనే సమావేశాలు ఉంటాయని, జగన్ బిజీగా ఉంటారని పార్టీ తెలిపింది.

    ఇటీవల విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవి విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుందని అంటున్నారు నేతలు. కష్టకాలంలో కూడా పార్టీని వీడి వెళ్లకుండా పని చేస్తే, తిరిగి అధికారం తమదేనంటున్నారు. పార్టీ నేతల్ని ఆమేరకు సమాయత్తం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు రోజులు పూర్తిగా నేతలకే ఆయన సమయం కేటాయించారు.

    ఇప్పటికే పార్టీ కీలక నేతలు తాడేపల్లి చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించి.. పలు అంశాలపై నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతోపాటు, రాజకీయ హత్యలు, దాడులపై కూడా చర్చ జరిగే అవకాశముంది. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దని జగన్ భరోసా ఇస్తారు.

    సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేలా కేడర్ ని సమాయత్తం చేస్తారు జగన్. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటున్నారని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై నిజా నిజాలు ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. 

    ex cm Jagan
    Previous Articleచంద్రుడిపై అన్వేషణకు ఇస్రో మరో 2 డిజైన్లు
    Next Article ఏపీలో ఎగ్‌పఫ్‌ ఇష్యూ.. టీడీపీకి వైసీపీ సవాల్‌!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.