Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, May 17
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    ప్రత్యేక హోదాపై మౌనం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమే

    By Telugu GlobalJuly 23, 20241 Min Read
    ప్రత్యేక హోదాపై మౌనం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమే
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పార్లమెంట్‌ అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ప్రస్తావించకపోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తప్పుబట్టారు. అఖిలపక్ష భేటీలో ఇతర పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టినా.. టీడీపీ సభ్యులు మౌనం వహించడం రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన టీడీపీపై ఈ విమర్శలు చేశారు.

    ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు..

    రాష్ట్రంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని వి.శ్రీనివాసరావు విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలకే పరిమితమైన గవర్నర్‌ ప్రసంగం.. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన కొత్త ప్రభుత్వం వారి ఆకాంక్షలు ఎలా నెరవేర్చుతుందనే విషయాన్నే ప్రస్తావించలేదని గుర్తుచేశారు. గవర్నర్‌ ప్రసంగంలో విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారని, ఆ లోటును పూడ్చడానికి అవసరమైన ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు ప్రస్తావన చేయకపోవడం అన్యాయమని తెలిపారు.

    వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుకునేందుకు నిర్దిష్టమైన ప్రకటన ఏదీ గవర్నర్‌ ప్రసంగంలో చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గుర్తుచేశారు. ఇక పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే గవర్నర్‌ ప్రసంగంలో లేకపోవడం విస్మయానికి గురిచేసిందని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం సాగిన తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు అవసరమైన నేపథ్యాన్ని సృష్టించేదిగా ఉందని ఆయన పేర్కొన్నారు.

    AP State Secretary CPM
    Previous Articleఏపీలో మరో అటాక్.. కొడాలి నాని మాజీ పీఏపై దాడి
    Next Article పవన్ తో టీ, లోకేష్ తో కాఫీ.. అలా నిధులు రాబడదాం
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.