Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, July 16
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    బాబు, లోకేష్, జగన్.. ఎవరెవరు ఎంత తింటారు..?

    By Telugu GlobalAugust 16, 20242 Mins Read
    బాబు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    అన్న క్యాంటీన్ల ప్రారంభంపై వైసీపీ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ట్వీట్ తో తిరిగి వైసీపీనే టార్గెట్ చేసింది టీడీపీ. అసలు వైసీపీ చేసిన కామెంట్ ఏంటి..? టీడీపీ దానికి ఇచ్చిన కౌంటర్ ఏంటి..? ఓసారి మీరే చూడండి.

    అయ్య రెండు స్పూన్లు అన్నం తిన్నాడు..

    కొడుకు పావు ముక్క ఇడ్లీతో సరిపెట్టాడంటూ..అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో చంద్రబాబు, లోకేష్ ఆహారం తీసుకోవడంపై వైసీపీ వెటకారంగా స్పందించింది. పేదలకు పెట్టే అన్నం, టిఫిన్ కాబట్టి తండ్రీ కొడుకులిద్దరికీ ముద్ద దిగలేదని వైసీపీ అఫిషియల్ అకౌంట్ ద్వారా కౌంటర్ ఇచ్చింది. వాళ్లు పెడుతున్న ఆహారంపై వారికే నమ్మకం లేదని దెప్పిపొడిచింది. ప్రజలతో కలిసిపోవడం, వాళ్లు తినే అన్నం ముద్దను వాళ్లతోనే కలిసి పంచుకోవడం అంటే ఫొటోలు దిగినంత ఈజీ కాదని తేల్చి చెప్పింది వైసీపీ.

    అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో…
    అయ్య రెండు స్పూన్లు అన్నం తింటే,
    కొడుకు పావు ముక్క ఇడ్లీతో సరిపెట్టాడు.
    ఎందుకంటే… అది పేదలకు పెట్టే ఆహారం.
    పైగా ఐదు రూపాయలకు పెడుతున్న ఆహారం.
    ఆకలి తీర్చే ఆహారాన్ని తక్కువ చేయడం కాదు కానీ… తమ ప్రభుత్వం పెడుతున్న భోజనం మీద ఈ తండ్రీ… pic.twitter.com/iVdKybdqR9

    — YSR Congress Party (@YSRCParty) August 16, 2024

    మీ సంగతేంటి..?

    చంద్రబాబు, లోకేష్ పై వేసిన సెటైర్లకు టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. గతంలో జగన్ పాదయాత్రలో ఓ పేద కుంటుంబాన్ని ఓదార్చి వారి ఇంట్లో అన్నం తినే వీడియోని టీడీపీ ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేసింది. అప్పట్లో జగన్ ఓ రేంజ్ లో నటించారని, అలా నటించడం తమ నాయకులకు చేతకాదని అంతే వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పై వైసీపీ ఏడుపు చూస్తుంటే, ప్రజలు ఆ పార్టీకి 11 కాదు, 1 ఇచ్చినా తప్పు లేదని టీడీపీ విమర్శించింది.

    పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పై నిన్నటి నుంచి, నువ్వు ఏడుస్తున్న ఏడుపు చూస్తుంటే, నీకు ప్రజలు 11 కాదు, 1 ఇచ్చినా తప్పు లేదు.

    చంద్రబాబు గారు, లోకేష్, ప్రజలతో కలిసిపోయే వారు కాబట్టే, ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. నీకు ప్రజలంటే చీదరతో, ప్యాలెస్ లో కులికావు కాబట్టే నీకు 11… https://t.co/St7BBOF5TQ pic.twitter.com/PHzR6nsLIm

    — Telugu Desam Party (@JaiTDP) August 16, 2024

    వైసీపీ, టీడీపీ ట్వీట్లు రోజు రోజుకీ మరింత పర్సనల్ గా మారిపోతున్నాయి. ఆగస్ట్ 15న స్పీచ్ లో తప్పులున్నాయని, అన్న క్యాంటీన్ లో లోకేష్ అర ఇడ్లీతో సరిపెట్టారని.. ఇలాంటి వాటన్నిటినీ హైలైట్ చేయాలనుకుంటోంది వైసీపీ. అదే సమయంలో పాత వీడియోలు వారికి కౌంటర్లుగా మారుతున్నాయి. ఇరు పార్టీల వీడియోలతో నెటిజన్లకు మాత్రం వినోదం మిగిలింది.

    Chandrababu Naidu Nara lokesh
    Previous Articleబాలయ్య కోర్కెను బావ నెరవేరుస్తారా..?
    Next Article హర్యానా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. డేట్స్‌ ఇవే
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.