భర్తపై కేసు పెట్టిన ప్రముఖ బాక్సర్ ఎందుకంటే?

అర్జున అవార్డు గ్రహీత స్వీటీ బూరాకు కూడా అత్తింటి వేధింపులు తప్పలేదు.;

Advertisement
Update:2025-02-27 17:21 IST

అర్జున్ అవార్డు గ్రహీత, హర్యానా ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బూర తన భర్త అత్తింటి వేధింపులు నుంచి వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్నాది. దీంతో భర్త భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా అత్తింటి వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అందుకున్న పోలీసులు వరకట్న వేధింపుల కేసును నమోదు చేసినట్టు హిసార్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీమా పేర్కొన్నారు. ఈ నెల 25న దీపక్ హుడాపై స్వీటీ బూరా వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై హుడాకు 2-3 సార్లు నోటీసులు కూడా ఇచ్చామన్న సీమా, గాయం కారణంగా ఆరోగ్యం బాగోలేదని, హాజరు కాలేనని అతను చెప్పినట్టు ఆమె తెలిపారు. మెడికల్ సర్టిఫికేస్ట్ పోలీసులకు ఇచ్చానని, మరొకరోజు వస్తానని పేర్కొన్నారు.

తన భర్త తనను కొట్టి ఫార్చ్యూనర్ కారు, కోటి రూపాయల కట్నం డిమాండ్ చేశాడని సవీతి ఆరోపించగా, దీపక్ తన అత్తమామలు ఆస్తిని ఆక్రమించుకుని మోసం చేశారని ఆరోపించారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసు ఫిర్యాదు చేసుకున్నారు. విడాకులు, భరణం కోసం సవీతి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. హిసార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, దీపక్ తన నుండి ఫార్చ్యూనర్ కారు, కోటి రూపాయలు డిమాండ్ చేశాడని ఆమె తెలిపింది. ఆటను వదిలేయాలని ఆమెపై ఒత్తిడి వచ్చిందని సవీతి తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన గొడవ తర్వాత తనను ఇంటి నుండి వెళ్లగొట్టారని సవీతి చెప్పింది.స్వీటీ బూరా, దీపక్ హుడాలకు 2022లో వివాహం జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్‌తక్ జిల్లాలో ఉన్న మెహం నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున ఎన్నికల్లోనూ పోటీ చేశారు. భారత కబడ్డీ జట్టులో సభ్యుడైన దీపక్, 2014 నాటి ఆసియా క్రీడల్లో కాంస్యం, 2016లో దక్షిణాసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచారు.

Tags:    
Advertisement

Similar News