Telugu Global
Telangana

హోలీ వేడుక‌ల్లో విషాదం.. వార్ధా న‌దిలో మునిగి న‌లుగురు యువ‌కుల మృతి

ఉత్సాహంగా రంగులు చ‌ల్లుకుని, ఆ త‌ర్వాత వార్ధా న‌దిలో స్నానానికి వెళ్లిన న‌లుగురు యువ‌కులు నీట మునిగి చ‌నిపోయారు.

హోలీ వేడుక‌ల్లో విషాదం.. వార్ధా న‌దిలో మునిగి న‌లుగురు యువ‌కుల మృతి
X

రంగుల పండ‌గ హోలీ ఆ కుటుంబాల్లో చీక‌ట్లు నింపింది. ఉత్సాహంగా రంగులు చ‌ల్లుకుని, ఆ త‌ర్వాత వార్ధా న‌దిలో స్నానానికి వెళ్లిన న‌లుగురు యువ‌కులు నీట మునిగి చ‌నిపోయారు. తెలంగాణ‌లోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండ‌లం తాటిప‌ల్లిలో సోమ‌వారం ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ప‌ట్టుమ‌ని పాతికేళ్లు కూడా నిండ‌ని త‌మ బిడ్డ‌లు క‌డ‌తేరిపోయారంటూ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరయ్యారు.

పాతికేళ్ల‌లోపు వారే

కౌటాల మండ‌లం న‌దీమాబాద్‌కు చెందిన సంతోష్ (25), సాయి (23),ప్ర‌వీణ్ (23), క‌మ‌లాక‌ర్ (24) సోమ‌వారం ఉద‌యం ఉత్సాహంగా హోలీ ఆడారు. రంగులు పూసుకుని, స్నేహితుల‌కు పూస్తూ సంతోషంగా గ‌డిపారు. త‌ర్వాత స్నానం చేసేందుకు తాటిప‌ల్లి వ‌ద్ద వార్ధా న‌దిలో దిగారు. కాసేప‌టికే వారు గ‌ల్లంత‌య్యారు. అధికారులు, పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి న‌లుగురూ మృతిచెందిన‌ట్లు గుర్తించారు.

First Published:  25 March 2024 4:02 PM GMT
Next Story