Telugu Global
Cinema & Entertainment

Tillu Square | ఆ 2 అంశాలపై క్లారిటీ ఇచ్చిన సిద్ధు

Tillu Square | టిల్లూ స్క్వేర్ సినిమాకు సంబంధించి కీలకమైన 2 అంశాలపై క్లారిటీ ఇచ్చాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ.

Tillu Square | ఆ 2 అంశాలపై క్లారిటీ ఇచ్చిన సిద్ధు
X

ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'టిల్లు స్క్వేర్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రమోషన్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సినిమా భారీస్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ.

"టిల్లూ స్క్వేర్ సినిమా రన్ టైమ్ చాలా తక్కువ. అది కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాం. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం. ఆ ప్రయత్నంలో నిడివి తగ్గింది."

ఇక దర్శకుడి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు సిద్ధూ. సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయానికి విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని, మరోవైపు తను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నామని.. అలా తమ ఇద్దరి కలయికలో డీజే టిల్లు సీక్వెల్ వచ్చిందని తెలిపాడు.

First Published:  29 March 2024 2:38 AM GMT
Next Story