Telugu Global
Andhra Pradesh

టీడీపీ చివరి లిస్టు రిలీజ్.. బొత్సపై పోటీ ఎవరంటే..!

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక టీడీపీ చివరి లిస్టుపై ఆశలు పెట్టుకున్న RRRకు నిరాశే ఎదురైంది. తెలుగుదేశం జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు.

టీడీపీ చివరి లిస్టు రిలీజ్.. బొత్సపై పోటీ ఎవరంటే..!
X

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేసింది. చివరి లిస్టులో 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా తెలుగుదేశం 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బీజేపీ 10, జనసేన 21 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన పంతం నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు భీమిలి సీటు దక్కించుకున్నారు. ఇక ఎచ్చెర్ల సీటు ఆశించిన సీనియర్ నేత కళా వెంకట్రావును మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దించారు చంద్రబాబు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక టీడీపీ చివరి లిస్టుపై ఆశలు పెట్టుకున్న RRRకు నిరాశే ఎదురైంది. తెలుగుదేశం జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు.

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే -

- చీపురుపల్లి- కళా వెంకట్రావు

- భీమిలి- గంటా శ్రీనివాసరావు

- పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు

- దర్శి- గొట్టిపాటి లక్ష్మి

- రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం

- ఆలూరు- వీరభద్ర గౌడ్‌

- గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్

- అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌

- కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌

పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే -

- విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు

- ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి

- అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ

- కడప- భూపేష్‌రెడ్డి

First Published:  29 March 2024 9:14 AM GMT
Next Story